హైదరాబాద్లోని గాంధీభవన్లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో నేతల మధ్య గందరగోళం చోటుచేసుకుంది. సీనియర్ నేత వీ. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముస్లింలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీతో ఉండి.. పోలింగ్ సమయంలో హ్యాండిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ఆయన చేసి కామెంట్స్తో ఒక్కసారిగా కుర్చీలు గాల్లోకి లేచాయి. Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి ఓ వర్గం నేతలు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీహెచ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో వెంటనే సమావేశం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లిపోయారు. Also Read: మసీదులో జైశ్రీరాం అంటే తప్పేంటి..సుప్రీంకోర్టు ప్రశ్న