Telangana Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వెల్లడించింది.

New Update
Telangana Rain update

Telangana Rain

తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రాష్ట్రంలోని వ్యవసాయానికి జీవనాడి, వరి, పత్తి వంటి పంటలకు చాలా ఉపయోగపడతాయి. అయితే.. కొన్నిసార్లు అతివృష్టి వల్ల వరదలు సంభవిస్తాయి. దీనివల్ల ప్రజల జీవితాలు, ఆస్తులు ప్రమాదంలో పడతాయి. నదులు, చెరువులు నిండిపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ప్రతి సంవత్సరం వర్షాల తీరు మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు అధికంగా, కొన్నిసార్లు తక్కువగా ఉంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ మరియు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 18న భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు ఐఎమ్‌డీ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. దీంతో ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు. అటు ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో భారీ వర్షాలు.. వర్షంలో తడుస్తూ పోలీసుల విధులు!-PHOTOS

గత 24 గంటల్లో సిద్దిపేట జిల్లా గౌరారంలో రికార్డు స్థాయిలో 23.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సిద్దిపేటలోని ములుగులో 18.65 సెం.మీ., మెదక్‌లోని ఇస్లాంపూర్‌లో 17.95 సెం.మీ., కామారెడ్డిలోని పిట్లంలో 17.5 సెం.మీ., యాదాద్రి భువనగిరిలోని అడ్డగుడూర్‌లో 16.48 సెం.మీ., సంగారెడ్డిలోని కంగటిలో 16.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. హైదర్‌నగర్‌లో 4.5 సెం.మీ., మల్కాజిగిరిలో 4.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాలు పచ్చదనాన్ని, వాతావరణాన్ని చల్లబరిచి ఆహ్లాదకరంగా మారుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

Advertisment
తాజా కథనాలు