/rtv/media/media_files/2025/12/19/harish-rao-mortgaged-his-home-for-medical-student-study-2025-12-19-14-37-34.jpg)
harish rao mortgaged his home for Medical Student Study
ఓ పేద విద్యార్థిని చదువు కోసం మాజీమంత్రి హరీశ్రావు మంచి మనుసును చాటుకున్నారు. ఆ యువతి పీజీ వైద్య విద్య కోసం ఏకంగా తన సొంత ఇంటినే తనఖా పెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మమత అనే విద్యార్థిని ఉచితంగా MBBS సీటు సాధించి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత పీజీ ఎంట్రన్స్ పరీక్ష రాయగా మహబూబ్నగర్లోని SVS మెడికల్ కాలేజీలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది.
Also Read: రూ.15వేల కోట్ల విలువైన భూమి తెలంగాణదే: సుప్రీంకోర్టు
పీజీ ఎంట్రన్స్లో సీటు వచ్చినా కుడా ట్యూషన్ ఫీజులకు ఏటా రూ.7.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం కోసం వెళ్తే ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. డిసెంబర్ 18న ట్యూషన్ ఫీజు చెల్లించి కాలేజీలో చేరకుంటే పీజీ సీటు తిరస్కరించే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మమత కుటుంబ సభ్యులు హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఏకంగా తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. అంతేకాదు మమత హాస్టల్ ఫీజు కోసం లక్ష రూపాయలు ఇచ్చారు.
Also Read: జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు.. BC రిజర్వేషన్పై రేవంత్ సర్కార్ ప్లాన్ ఇదే!
సరస్వతి పుత్రిక చదువుకోసం హరీష్ రావు అవుదార్యం
— TNews Telugu (@TNewsTelugu) December 19, 2025
పేద విద్యార్థిని పీజీ వైద్యవిద్య రుణం కోసం బ్యాంకులో తన స్వగృహన్ని మార్టిగేజ్ చేసిన మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు
మమత అనే అమ్మాయి విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి చదువు పూర్తి… pic.twitter.com/B20MWbkKnE
Follow Us