Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించటం వెనుక కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని నిలదీశారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. సభ నుండి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావు దేనా అంటూ కవిత బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. బాయ్ కాట్ నిర్ణయం అధిష్టానందే అయితే అది శ్రేయస్కరం కాదని చెప్పారు.
ప్రతిపక్షం లేకుండా కృష్ణా నీటి పై అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప కృష్ణా నది నీటి వాటా పై చర్చ లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారని కవిత పేర్కొన్నారు. కృష్ణా పై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడంలేదని ప్రశ్నించారు. అదే విధంగా.. తుంగభద్ర , కృష్ణ నీటి పై కర్నాటకతో పేచీ ఉంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడంలేదని నిలదీసారు. కురచ స్వభావంతో గత ప్రభుత్వం పై ని నిందలు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ తప్పులు కప్పిపుచ్చు కుంటున్నారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని.. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు.
Kavitha : బీఆర్ఎస్ లో హరీష్ రావు ఓ గుంపును తయారు చేస్తున్నారు...కవిత హాట్ కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా..హరీష్ పైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించడానికి కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు.
Kalvakuntla Kavitha
Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ జరిగిన తీరుపైనా.. హరీష్ రావుపైనా కీలక ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ను ఎవరు నడిపిస్తున్నారని నిలదీసారు. బీఆర్ఎస్ సభను బహిష్కరించటం వెనుక కారణం ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావును ఒక్క మాట అంటే సభని బైకాట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఆ అంశంపై వాకౌట్ చేస్తే.. తరువాత సభకు రావొచ్చు కదా? అని నిలదీశారు. ఆదివారం నాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన కవిత.. అసెంబ్లీలో బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? అని ప్రశ్నించారామె. సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావుదేనా? అని ప్రశ్నించారు.
అసెంబ్లీ బయట సభలు పెట్టడం కంటే.. చట్ట సభల్లో మాట్లాడటం మంచిదని.. ఈ అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. గుంటనక్క హరీష్ రావు వ్యవహారం.. తోక కుక్కను ఊపినట్లుగా ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కవిత. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీష్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి.. పీపీటీ చేయాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్ రావు ధన దాహం కోసమే జూరాలా నుంచి శ్రీశైలానికి ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. సభ నుండి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీష్ రావు దేనా అంటూ కవిత బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. బాయ్ కాట్ నిర్ణయం అధిష్టానందే అయితే అది శ్రేయస్కరం కాదని చెప్పారు.
ప్రతిపక్షం లేకుండా కృష్ణా నీటి పై అడ్డగోలు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప కృష్ణా నది నీటి వాటా పై చర్చ లేదన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారని కవిత పేర్కొన్నారు. కృష్ణా పై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడంలేదని ప్రశ్నించారు. అదే విధంగా.. తుంగభద్ర , కృష్ణ నీటి పై కర్నాటకతో పేచీ ఉంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడంలేదని నిలదీసారు. కురచ స్వభావంతో గత ప్రభుత్వం పై ని నిందలు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ తప్పులు కప్పిపుచ్చు కుంటున్నారని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని.. ఆల్మట్టి ఎత్తు తగ్గించాలనే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు.