Jubilee Hills by-election: ECకి హరీశ్ రావు ఫిర్యాదు.. మద్యం, చీరల పంపిణీ వీడియోలు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని BRS నేత హరీశ్ రావు అన్నారు. ఆయన సోమవారం BRK భవన్‌లో ఎన్నికల అధికారి సూదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంగించి కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.

New Update
_Harish Rao complains to EC

Harish Rao complains to EC

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం BRK భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంగించి కాంగ్రెస్ పార్టీ డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. కొందరు అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా కొందరు పోలీసులు, ఎన్నికల అధికారులు మారారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుగోలుగా మద్యం, చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేస్తూ ఆలస్యంగా రావడం, ఇన్‌ఫర్మేషన్ లీక్ చేసి చీరలు పంచే వారిని అలర్ట్ చేసి అధికారులు అక్కడికి వస్తున్నారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. వాటన్నింటిని వీడియోలు, ఫోటొల ఆధారాలతో సహా చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు అందజేశామన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదులు స్వీకరించారు. వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు హరీశ్ రావు మీడియాకు తెలిపారు.

ఎర్రగడ్డ, షేక్‌పేట, బోరబండ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపిణీ చేస్తున్న అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సి విజిల్ ఆప్‌లో కూడా కంప్లైయింట్ చేశామని చెప్పారు. కుప్పలు కుప్పలుగా ఫేక్ ఓటర్ ఐడీలు కూడా అధికార పార్టీ తయారు చేస్తోందని ఆయన ఆరోపించారు. యూసఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆనుకోని పోలింగ్ బూత్ ఉందన్నారు. పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల దూరంలో పార్టీ కార్యాలయాలు ఉండకూడదనే రూల్ ఎన్నికల అధికారులు మార్చిపోయారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. వెంటనే పోలింగ్ బూత్ లేదా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అక్కడ నుంచి మార్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నిలలో ఓటమి భయంతో ఈరోజు ఆరు గ్యారెంటీలపై రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆరుగ్యారెంటీలపై రెండేళ్లుగా ఎందుకు రివ్వ్యూ పెట్టలేదని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ఎన్నికతో రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయని హరీశ్ రావు చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు