Contract Outsourcing Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌..ఇకమీదట అకౌంట్ లోకే జీతాలు

రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

New Update
FotoJet - 2026-01-21T114721.649

Contract and outsourcing Employees

Contract Outsourcing Employees: రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఏప్రిల్ నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు జమ చేయనుంది. మధ్య వర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్​ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్​ ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​) విధానంలో జీతాలను సర్కారు చెల్లిస్తోంది.  ఇకమీదట కాంట్రాక్ట్‌ కార్మికులకు అదే విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుత ఐఎఫ్​ఎంఎస్​లోనే ప్రత్యేక ఆప్షన్​ ఇచ్చి వీరికి శాలరీలు జమ చేయడమా.. లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్​పోర్టల్​ తయారు చేయడమా? అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల జీతాలను వారి హెచ్​వోడీలు, లేదంటే ఏజెన్సీలకే సర్కారు జమచేస్తూ వస్తోంది. అయితే ఆయా ఎజెన్సీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతోపాటు  భారీ అక్రమాలు జరుగుతున్నాయి. దీంతో  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం ఇకపై మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా వారి చేతికే అందే అవకాశం ఉంది. అదే సమయంలో కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, గురుకులాలు, హెల్త్​ డిపార్ట్​మెంట్​, మైనార్టీ సంక్షేమ శాఖ తదితర రంగాల్లో జరుగుతున్న అక్రమాలకు తెరపడేందకు ఆవకాశం ఉంటుందని భావిస్తోంది.

Also Read: కొంపు ముంచిన కారు..ఇందిరమ్మ ఇంటికి నో ఛాన్స్‌

దోపిడీ.. బినామీల దందాకు బ్రేక్

ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల్లో గత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 4.93 లక్షల మంది  కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారి  వివరాలను ఆధార్‌‌‌‌‌‌‌‌తో అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేయాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది, ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఖ్య గతంలో అనుకున్న దానికంటే  కాస్త పెరిగి, ప్రస్తుతం 5 లక్షలకు చేరింది. దీనికి కారణం గ్రామాల్లో పనిచేసే మల్టీపర్పస్ ఉద్యోగుల వివరాలను కూడా ఇందులో  చేర్చడమే అని తెలుస్తోంది. ఇన్నాళ్లూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పైచేయిగా ఉంది. ప్రభుత్వం నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లు తేలింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకుంటున్నట్లూ కూడా బయటపడింది.   ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాల కోసం నిధులు విడుదలైనప్పటికీ, చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్న విషయం కూడా బయటకు వచ్చింది. కొన్ని విభాగాల్లో అయితే అసలు లేని ఉద్యోగుల పేర్లతో బినామీలను సృష్టించి  అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం నేరుగా శాలరీ బదిలీ  విధానాన్ని ప్రవేశపెట్టనుంది. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఉండడంతోపాటు కిందిస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనం అందే అవకాశం ఉంటుంది.

Also Read: అయ్యో..పిజ్జా హట్ చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..అసలేం జరిగిందంటే..

కార్మికులకు మేలు

ఏజెన్సీల జాప్యం వల్ల నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కార్మికులది. ఇక మీదట  ఉద్యోగులందరికీ ఐఎఫ్​ఎంఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్​ ద్వారానే చెల్లింపులు చేస్తే దీని నుంచి విముక్తి లభించనుంది. అంతేకాక ప్రతి నెలా  వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుంది.  జీతాలు నేరుగా పడటం వల్ల కేవలం నగదు అందడమే కాకుండా, ఉద్యోగుల సామాజిక భద్రతకు కూడా గ్యారెంటీ ఉంటుంది. ఇప్పటివరకు ఏజెన్సీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా, ఇకపై ప్రభుత్వమే నేరుగా పర్యవేక్షించనుండటంతో ప్రతి ఉద్యోగికి అందాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ వాటాలు కూడా సక్రమంగా జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వారికి ప్రమాద బీమా లేదా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్తున్నారు.  

Also Read: గుంపు మేస్ట్రీ.. గుంటనక్క ఒక్కటే..తెలంగాణ జాగృతి కవిత సంచలన వ్యాఖ్యలు

పక్కాగా ఉద్యోగుల వివరాలు

ఇక మీదట డిపార్ట్​మెంట్ల వారీగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తోంది. పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్,  బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తోంది. గతంలో ఏ ఉద్యోగి, ఎక్కడ పనిచేస్తున్నారో, వారికి ఎంత జీతం అందుతుందో తెలిసేది కాదు. ఇప్పుడు పటిష్టమైన డిజిటల్ డేటాబేస్ సిద్ధం కావడంతో, ఒక్క క్లిక్‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలోని ఏ మూలన ఉన్న ఉద్యోగి వివరాలైనా తెలుసుకునే  అవకాశం కలిగింది. ఆధార్ లింకింగ్ తో ఒకే వ్యక్తి రెండు వేర్వేరు చోట్ల పనిచేస్తున్నట్లు చూపి జీతాలు పొందడం లేదా ఒకే పేరుతో రెండు అకౌంట్లకు నిధులు మళ్లించడం వంటి మోసాలకు చెక్‌ పెట్టడానికి అవకాశం ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు