Geotagging : మేడారం జాతరలో పిల్లలు, వృద్ధులకు జియోట్యాగింగ్‌

కోటిన్నరకు పైగా భక్తులు హాజరయ్యే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో పిల్లలు, వృద్దులు తప్పిపోకుండా ఉండడానికి, ఒకవేళ తప్పిపోయిన వెంటనే వారి ఆచూకీ తెలుసుకోవడానికి వీలుగా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వారికి జీయో ట్యాగింగ్ చేస్తోంది.

New Update
FotoJet - 2026-01-19T120954.785

Geotagging for children and elderly

Geotagging: కోటిన్నరకు పైగా భక్తులు హాజరయ్యే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే జాతరలో పిల్లలు, వృద్దులు తప్పిపోకుండా ఉండడానికి, ఒకవేళ తప్పిపోయిన వెంటనే వారి ఆచూకీ తెలుసుకోవడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనికోసం కృత్రిమ మేధ (AI) సాంకేతికతను వినియోగిస్తోంది. 'టీజీ-క్వెస్ట్‌' ఏఐ డ్రోన్లు, హీలియం బెలూన్ కెమెరాలతో జాతరలో నిఘా ఉంచుతున్నారు. తప్పిపోయిన వారి కోసం జియోట్యాగ్ వ్యవస్థ, నేరగాళ్ల గుర్తింపునకు ఫేస్ రికగ్నిషన్ అందుబాటులోకి తీసుకు వచ్చారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ vs అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2026: బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేయండి!

దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సరికొత్త సాంకేతిక సొబగులను అద్దుకుంటోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ముందెన్నడూ లేని విధంగా కృత్రిమ మేధ (AI) పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనుకుంటోంది.  భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, జాతర ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. జాతరలో భద్రతను పర్యవేక్షించేందుకు 'మేడారం 2.0'లో భాగంగా ‘టీజీ-క్వెస్ట్‌’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీగా ఉండే రహదారులపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచేలా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం డ్రోన్లే కాకుండా.. ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు పాన్-టిల్ట్-జూమ్ కెమెరాలను అమర్చనున్నారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13 వేల మంది పోలీసు సిబ్బంది ఈ అత్యాధునిక నిఘా నీడలో విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Also Read: అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' షురూ.. ఈ 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

జియోట్యాగింగ్‌తో తప్పిపోయిన వారి చెక్

గత జాతరలో సుమారు 30 వేల మంది వరకు తప్పిపోయినట్లు సమాచారం ఉంది. అందుకే అలాంటి చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి వొడాఫోన్-ఐడియా సహకారంతో ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ కలిగిన జియోట్యాగ్‌లను చేతులకు కడతారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే, ఈ ట్యాగ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవడానికి వీలువుతుంది. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించడం విశేషం.

నేరగాళ్ల గుర్తింపునకు 'ఫేస్ రికగ్నిషన్'

ఇక జాతరలో శాంతిభద్రతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజల రక్షణకు 12 ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పాత నేరస్థులను ఈజీగా పసిగట్టేలా ఏర్పాట్లు చేశారు. అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్-టైమ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్‌మెంట్ పాయింట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు