SLBC RESCUE OPERATION : మట్టి దిబ్బకింద నలుగురు - టన్నెల్​ బోర్​ కింద మరో నలుగురు!

వారం రోజులుగా సాగుతోన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఎనిమిది మంది ఎక్కడున్నారో రాడార్ సర్వే ద్వారా గుర్తించామని మంత్రి జూపల్లి ప్రకటించారు. మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు

New Update
slbc

slbc Photograph: (slbc)

SLBC RESCUE OPERATION : వారం రోజులుగా సాగుతోన్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఎనిమిది మంది ఎక్కడున్నారో రాడార్ సర్వే ద్వారా గుర్తించామని మంత్రి జూపల్లి ప్రకటించారు. మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు

Also Read: పవన్‌ను అందుకే బూతులు తిట్టా.. పోసాని రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
 
 ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్​ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బటయకు తీసుకొచ్చేందుకు నిర్వహిస్తోన్న రెస్క్యూ ఆఫరేషన్‌ కీలక దశకు చేరుకుంది.టన్నెల్‌లో జరుగుతున్న సహాయక చర్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాడార్‌ ద్వారా టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కన్పించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వివరించారు.

Also Read: 13ఏళ్ల పగ.. నంబర్ బ్లాక్ చేసిన ప్రియుడిని కత్తితో పొడిచి, కారు ఎక్కించిన యువతి.. లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

టన్నెల్‌లో పెద్ద ఎత్తున మట్టి కూలిందని 5-8 మీటర్ల మట్టిదిబ్బలు పేరుకుపోయాయని మంత్రి తెలిపారు. ఆ మట్టిదిబ్బల కింద నలుగురి వ్యక్తుల ఆనవాళ్లు ఉన్నట్లు స్కానింగ్‌లో కన్పించాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మరో నలుగురు సిబ్బంది టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ కింద ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వివరించారు. సహాయక చర్యల్లో మొత్తం 12 విభాగాలు పనిచేస్తున్నాయని మంత్రి వివరించారు.

Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

 పనులు వేగంగా జరగటం లేదని కొందరు విమర్శిస్తున్నారని, లోపల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వారికి తెలియట్లేదని జూపల్లి మండిపడ్డారు. విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థమవుతుందని జూపల్లి తెలిపారు. కాళేశ్వరంలో 200 కిలోమీటర్ల సొరంగం తవ్వామని బీఆర్ఎస్​ నేత హరీశ్ రావు అన్నారన్న జూపల్లి మరి పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీలో 20 కిలోమీటర్ల టన్నెల్‌ ఎందుకు తవ్వలేదు? అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదేమో అని మంత్రి జూపల్లి కృష్ణారావు అభిప్రాయపడ్దారు. 

Also Read: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

Also Read :  చికెన్ తింటే ఏం కాదు.. లైవ్ లో తిని చూపించిన హరీష్ రావు!

Advertisment
Advertisment
తాజా కథనాలు