డాగ్స్ లోపలికి వెళ్ళగానే ఏం జరిగిందంటే..! | Collector Shocking Words On Cadaver Dogs | SLBC Rescue
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నల్లో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి ఆదివారం వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి SLBC ప్రాజెక్ట్ ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా దొమలపెంటకు చేరుకోనున్నారు.
వారం రోజులుగా సాగుతోన్న ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఎనిమిది మంది ఎక్కడున్నారో రాడార్ సర్వే ద్వారా గుర్తించామని మంత్రి జూపల్లి ప్రకటించారు. మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8మంది కార్మికులను రక్షించడానికి టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటకు వచ్చేసింది. వారిని రక్షించడం కష్టమేనని వ్యాఖ్యనించింది.
SLBC దోమలపెంట వద్ద టన్నెల్ లో చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తుబృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన బృందాలు ఇప్పటివరకు 7 సార్లు టన్నెల్ లో తనిఖీలు చేశాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతోన్నసహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఎంత కష్టమైనా టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. నిపుణుల అనుభవాలను తీసుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు.