హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్పై పోటీ ఎవరో తెలుసా? ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు సంభవించడం గమనార్హం. ఇటీవలే అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ తర్వాత మాదాపూర్లోని సత్వ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మాదాపూర్లోని ఖానామెట్లో సైతం భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం! శుక్రవారం జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో కూడా ఊహించని ప్రమాదం జరిగింది. రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసి పడ్డాయి. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదంమేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/eMgOhvhZzE — Telugu Scribe (@TeluguScribe) January 3, 2025 జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదంమేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/0PsZt0YAp4 — Telangana Chitralu (@tgchitralu) January 3, 2025 Also Read: తెలంగాణలో మరో ఘోరం.. గర్ల్స్ టాయిలెట్స్లో మొబైల్ కెమెరాతో వీడియో! Also Read: ఉద్యోగులకు సంక్రాంతి బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం