/rtv/media/media_files/2026/01/30/fotojet-89-2026-01-30-12-46-00.jpg)
Medaram Jathara
Medaram Jathara: మండపాలు కట్టలేదు! విగ్రహాలు ప్రతిష్ఠించలేదు! వేద మంత్రాలు లేవు! కానీ, భక్తుల గుండెలే వారికి కోవెలలు. గద్దెలపై ఉన్న వెదురు కర్ర, కుంకుమభరిణిలే వనదేవతల ప్రతిరూపాలు. అన్యాయంపై తిరగబడ్డ ఆడ బిడ్డలు అమరులైన చరిత్రకు ప్రతీక ఈ మేడారం జాతర. తల్లుల త్యాగాన్ని తలుచుకుంటూ వందల ఏళ్లుగా చేసుకుంటున్న వేడుక ఇది. అంతేకాదు, ఆదివాసీల సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అడవి ధిక్కార స్వరానికి సజీవ సాక్ష్యం. అందుకే, వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతలను కొలిచేందుకు లక్షలాది భక్తులు తండోపతండాలుగా వస్తారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తారు. అంతటి ప్రాముఖ్య ఉంది మేడారం మహా జాతరకు.
Also Read: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
మారుమూలన ఉన్న ఓ వనారణ్యం.. రెండేళ్లకోసారి జనారణ్యమై భాసిల్లడానికి జాతరలోని విభిన్నతే కారణం. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. గుడి ఉండదు.. గోపురాలు ఉండవు, ధ్వజస్తంభం ఉండదు.. ద్వారపాలకులు ఉండరు, అర్చకులు ఉండరు.. ఆర్జిత సేవలూ ఉండవు. నాలుగు వృత్తాకార గద్దెలపై, నడుమ పాతిన కర్రలే దైవాలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. జాతర వేళ కుంకుమ భరిణెలను ప్రతిష్ఠించినా అవి బయటకు కనిపించవు. నిండు పౌర్ణమి వేళ సమ్మక్క, సారలమ్మ రాక, గద్దెలపై కొలువుదీరే ఘట్టాలు మేడారం అటవీప్రాంతాన్ని భక్తిపారవశ్యపు శిఖరాగ్రాన నిలబెడతాయి. నిండు పున్నమి వెలుగులో దైవక్షేత్రంగా రూపుదాల్చి జేగీయమానమవుతుంది. మొక్కులు ఊపందుకుంటాయి. తల్లుల చెంతకు భక్తులు వెల్లువెత్తుతారు. ఆ సమయంలో గద్దెల ప్రాంగణమే కాదు, మేడారం యావత్తూ అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తూ సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది.
Also Read: ‘సీతా రామం 2’ కాదు.. కొత్త సినిమా కూడా కాదు: మృణాల్ - దుల్కర్ క్రేజీ వీడియో చూసేయండి!
మేడారంలో గుడి ఎందుకు లేదంటే ?
మేడారంలో సమ్మక్క-సారలమ్మలకు శాశ్వత గుడి (ఆలయం) లేకపోవడానికి ప్రధాన కారణం వారిది గిరిజన సాంప్రదాయం కావడం, ఆదివాసీ ఆచారాల ప్రకారం దేవతలు ప్రకృతిలో, గద్దెలపై కొలువై ఉంటారని నమ్మడం. విగ్రహాలకు బదులుగా పసుపు, కుంకుమ, చిలకల గుడ్డ (వస్త్రం) మరియు గద్దెలను (పీఠాలు) పూజిస్తారు, ఇది వారి ఆత్మాభిమానం మరియు సంస్కృతికి ప్రతీక. సమ్మక్క-సారలమ్మ గిరిజన దేవతలు, వారి పూజలు ప్రకృతిలో చెట్ల కింద, గద్దెల మీదనే జరగాలనేది ఆచారంగా వస్తోంది. శాశ్వత గుడికి బదులుగా, కేవలం జాతర సమయంలోనే చెక్కతో గద్దెలను (పీఠాలను) నిర్మించి, అమ్మవార్లను ప్రతిష్ఠిస్తారు.ప్రకృతిని దేవుడిగా భావించే ఆదివాసీలు, స్థిరమైన, బంధిత కట్టడాలను ఇష్టపడరు.
Also Read: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటింపు: 2016-2022.. ‘జై భీమ్’ సినిమా హవా
కాకతీయ రాజులు మేడారంపై మాఘ శుద్ధ పౌర్ణమి సమయలోనే దాడి చేశారని చెబుతారు. నిండు పౌర్ణమి రోజున జరిగిన యుద్ధంలో సమ్మక్కతో పాటు భర్త పగిడిద్దరాజు, బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజులు తనువు చాలించారు. అందుకే మాఘ శుద్ధ పౌర్ణమి ముందు వచ్చే బుధవారం నుంచి 4 రోజుల పాటు వనదేవతల జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సాంప్రదాయం వచ్చింది. ఈ నాలుగు రోజులు గద్దెల మీద అమ్మవార్లు కొలువై ఉంటారని నమ్ముతారు. ఆ సమయంలో నిండుపున్నమి వెన్నెల గద్దెలమీద పడుతుంది. అలా పడడం వల్ల దేవతల శక్తి మరింత ఇనుమడిస్తుందని వారు నమ్ముతారు. గుడి కట్టడం వల్ల వెన్నెల గద్దెలపై పడే అవకాశం ఉండదు కనుక గుడి కట్టడానికి గిరిజనులు అంగీకరించరు.
Follow Us