/rtv/media/media_files/2025/05/02/sxiUMmW0U9K17gUCIhDD.jpg)
Cricket betting gang
Cricket betting gang : ఓ అపార్ట్ మెంట్ను బెట్టింగ్ డెన్గా మార్చుకుని ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, దోమలగూడ పోలీసులు అరెస్టు చేశారు. విదేశీ ఏజెంట్ల నుంచి లాగిన్ ఐడీ తీసుకుని 5 శాతం కమీషన్తో సబ్ బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ఫోర్స్ డీసీపీ వైవీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్నగర్ కు చెందిన శ్రీరాజ్బూబ్కు అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్లు నిర్వహించే విదేశీ ఏజెంట్లతో పరిచయం ఏర్పడింది. దీంతో దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ 8 పవని లింగయ్య అపార్ట్మెంట్తీసుకున్నాడు.
Also Read: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్కు కిక్కు దిగే టార్గెట్!
ఆ అపార్ట్ మెంట్ను బెట్టింగ్ కు డెన్గా మార్చుకుని కొన్నాళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అభిమానులను పంటర్లుగా చేర్చుకొని బెట్టింగ్ ఊబిలోకి దింపేందుకు చిక్కడపల్లికి చెందిన హోండ్మనే సాయినాథ్, రేగల్ల గోపీనాథ్లను అనుచరులుగా (సబ్ బుకీలు) ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చిన డబ్బులో వారికి 5 శాతం కమీషన్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. తాను ఉండే అపార్టుమెంట్లోని ఫ్లాట్లోనే బెట్టింగ్ డెన్ నిర్వహిస్తున్నాడు. విదేశీ ఏజెంట్ల ద్వారా రాధీఎక్స్ డాట్ కామ్ అప్లికేషన్ నుంచి లాగిన్ ఐడీని పొందాడు. తన అనుచరుల ద్వారా పంటర్లను ఆహ్వానించి బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు.
Also Read: కర్రెగుట్టలపై సాయుధ బలగాలు.. మావోయిస్టులు ఎక్కడికెళ్లారంటే ?
బుధవారం చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్కు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పవాని లింగయ్య అపార్టుమెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన బుకీ శ్రీరాజ్ బూబ్తో పాటు, సబ్ బుకీలు హోండ్మనే సాయినాథ్, రేగల్ల గోపీనాథ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బెట్టింగ్ డబ్బు రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్లు ఉన్న మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దోమలగూడ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?