CM Revanth: మహిళలకు సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త!

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వి హబ్‌లో నిర్వహించిన విమెన్​ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో  పాల్గొన్న రేవంత్ రెడ్డి పట్టణ ప్రాంత మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేరిపించాలని అధికారులను ఆదేశించారు.

New Update
CM Revanth Reddy

CM Revanth Reddy

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వి హబ్‌లో నిర్వహించిన విమెన్​ యాక్సిలరేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నరేవంత్ రెడ్డి పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తికి చేయూతనిచ్చే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.ఇండియా చైనా యుద్ధం జరిగినపుడు, 1971 లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగినపుడు ఇందిరమ్మ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారన్నారు. దేశాన్ని గెలిపించిన శక్తి మహిళా శక్తని పేర్రొన్నారు.మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేదన్నారు.దేశానికి మహిళలు ఆదర్శం… మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్ దని సీఎం అన్నారు.

 ఇది కూడా చదవండి: ముఖం ఫిట్‌గా, యవ్వనంగా కావలా..? అయితే ఈ మూడు వ్యాయామాలు ట్రై చేయండి

Good News For Women

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్‌ రెడ్డి ఉద్ఘాటించారు.ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి మహిళలకు సోనియమ్మ నజరానా అందించారన్నారు.మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామన్నారు.విద్యార్థుల యునిఫార్మ్ కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా అందించామని రేవంత్‌ రెడ్డి వివరించారు.

Also Read :  ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్

వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్న ఆయన పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను చేసేందుకు మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామన్నారు.అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ ను కేటాయించామన్నారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని మేం నమ్ముతున్నామని సీఎం తెలిపారు.స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచుకోవాలని కోరుతున్నా నన్నారు.మీ రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తానని భరోసా ఇచ్చారు.

Also Read:  Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్

దేశంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని, కానీ ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారన్నారని గుర్తు చేశారు. ఆర్ధిక క్రమశిక్షణ మా ఆడబిడ్డల సొంతమని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామని,మీరు సమర్ధవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో వెయ్యి మెగావాట్ల సోలార్విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామని,మా ఆడబిడ్డలను ప్రోత్సహించడమే మా ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

Also Read: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిసైల్ ఇదే..! ధర ఎంతంటే?

women | cm-revanthreddy

Advertisment
Advertisment
తాజా కథనాలు