BREAKING: కేటీఆర్‌, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్‌.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ మరోసారి కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు

New Update

మరికొన్ని రోజుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ మరోసారి కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఉన్న సమయంలోనే హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందిందని.. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.  '' 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ సమయంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి వేగంగా జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో కేసీఆర్‌కు అప్పగించింది. 2024 మేము అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్ర అప్పులు రూ.8.11 లక్షల కోట్లుగా ఉంది.జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించి ఓటేయాలి.

Also Read:  నా మీద హై కమాండ్‌కు ఫిర్యాదు చేయకండి..ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్

''సచివాలయం, కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రగతి భవన్, కాళేశ్వరం మాత్రమే బీఆర్ఎస్ హయాంలో పూర్తయ్యాయి. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ హయాంలోనే కూలిపోయింది. సచివాలయంలో ఉన్న దేవాలయం, మసీదును కూలిస్తే కిషన్ రెడ్డి మాట్లాడలేదు. ప్రగతిని అడ్డుకుంటున్న కేటీఆర్‌, హరీష్ రావు బ్యాడ్ బ్రదర్స్. వీళ్లు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు. మూసీ నది ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, రీజనల్‌ రింగ్‌ రోడ్డును కూడా అడ్డుకుంటుంది వీళ్లే. గడిచిన రెండేళ్లలోనే మేము రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని'' రేవంత్ అన్నారు. 

Advertisment
తాజా కథనాలు