/rtv/media/media_files/2025/06/15/2j18cGkDrRCxDvAXcPLY.jpg)
Chiranjeevi joins BJP...Kishan Reddy
G. Kishan Reddy : బీజేపీలోకి ఎవరైనా వస్తారంటే పిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, నా మాట కాదనకుండా పిలవగానే చిరంజీవి వస్తారని బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. అనేక మంది సినీ ప్రముఖులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. విజయశాంతి, కోట శ్రీనివాస రావు, కృష్ణం రాజు, ఎస్ జానకి సుమన్, నరేష్ లాంటి వాళ్ళు పార్టీలో పనిచేశారని చెప్పారు. వారిలో కొందరు పార్టీలో చేరి మంత్రులు కూడా అయ్యారని, కొందరుపార్టీకి ప్రచారం చేశారని గుర్తు చేశారు.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
మాకు ప్రత్యర్థి కాంగ్రెస్పార్టీనే అన్న ఆయన ఎవడో పనికి రాని వాడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటే సమాధానం చెప్పాలా? అని ఫైర్ అయ్యారు. కుటుంబ, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీలో తర్వాతి అధ్యక్షుడు ఎవరో బీఆర్ఎస్ వాళ్లు చెప్పగలరా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్లో తరువాతి అధ్యక్షుడు ఎవరో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్లో డైనింగ్ టెబుల్ నిర్ణయాలు ఉంటాయని బీజేపీలో అలా కాదన్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే రెండు సార్లు క్రియాశీల సభ్యుడు అయ్యి ఉండాలన్నారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారని, అందువల్ల ఆయనకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.
Also read: మణిపూర్ వెపన్స్ ఆఫరేషన్..ఏకంగా 400 ఆయుధాలు స్వాధీనం
తెలంగాణలో టెక్స్ టైల్ ప్రాజెక్ట్ , జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ , పసుపు బోర్డు తెచ్చింది బీజేపీనేనన్న కిషన్ రెడ్డి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది కూడా తమ వల్లనే అన్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం తమ వల్లనే వచ్చిందని చెప్పుకుంటున్నారని, ఇవి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ప్రకటించామన్నారు.మా వల్లే వచ్చాయని చెప్పుకుంటున్నవారిని ఈడ్చి కొట్టాలని కిషన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందని, హైదరాబాద్ మెట్రో నెక్ట్స్ ఫేజ్కి కేంద్రం సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
Also Read: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం