/rtv/media/media_files/2025/02/06/HtBNFj56ARVvxPwLOSpy.jpg)
K. T. Rama Rao
By-Elections : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటు న్నామని, తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటు న్నారని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మె్ల్యేల అనర్హత విషయమై న్యాయపరంగా పోరాడు తున్నామని, ఇప్పటికే సుప్రీంలో కేసు వేశామన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందని, దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని కూడా సూచించిందన్నారు. ఇటీవల స్పీకర్ కార్యలయం కూడా వారికి నోటీసులు ఇచ్చారన్నారు. వారిపై వేటుపడుతుందనే నమ్మకం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ విషయమై ఇప్పటికే న్యాయ నిపుణులతోనూ చర్చిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
యూజీసీ నిబంధనలు మార్చడంపై మా అభ్యంతరాలు తెలియజేస్తూ కేసీఆర్ ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని కేటీఆర్ చెప్పారు. యూజీసీ నిబంధనలు మార్చడంపై మా అభ్యంతరాలు తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి అందజేశామన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్య హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. యూజీసీ నిబంధనల పేరుతో గవర్నర్లకు అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ ఎంపికలో నిపుణులు ఉండేలా పారదర్శకంగా ఉండాలని సూచించామన్నారు.రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీల బాధ్కతను రాష్ట్ర గవర్నర్ల చేత నియంత్రించాలని చూడడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని కేటీఆర్ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: LIC: LIC పాలసీదారులకు బిగ్ అలర్ట్.. అవి క్లిక్ చేశారో అంతా గోవిందా!
యూజీసీ సిబంధనలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఆరే పేజీలతోఒక లేఖ కూడా రాశామన్నారు. నో సూటబుల్ క్యాండిడేట్ (NSC) అనే ఒక క్లాజ్ తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ తదితర రిజర్వ్డ్ వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరో మంత్రి నితిన్ గడ్కరీ ను కూడా కలిసి సిరిసిల్లతో ముగుస్తున్న NH-365B ను రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి కట్టి కోరుట్ల వరకు పొడిగించాలని కోరామని కేటీఆర్ తెలిపారు.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం