BIG BREAKING: జూన్ మాసంలో బీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ స్టార్ట్ అవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ రోజు గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే గద్వాల్ లో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తరువాత 10 ఏండ్లు బలమైన పునాది వేశామన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్క బోర్ల పడ్డారన్నారు.
ఇది కూడా చదవండి: KCR Vs Kavitha: తండ్రితో తాడో పేడో.. కవిత ప్లాన్-బీ ఏంటో తెలుసా?
Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. 10 మంది సన్నాసులు పార్టీ విడిచి వెళ్లిపోయారో, వారికి కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను ఆవేశంతో చెప్పడం లేదని బాధతో చెబుతున్నానన్నారు. నాడు నీళ్లు, నిధులు నియామకాలు కోసం ఉద్యమం చేశామన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిందలు, దందాలు, చందాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. గంగుల కమలాకర్ సంచలన ప్రకటన!
రేవంత్ రెడ్డి ఒక సారి రాము.. మరోసారి రెమో..
రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. చారాణ కోడికి భారాణ మసాలా అన్నట్లు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి రాము, ఇంకోసారి రెమో అవుతాడన్నారు. సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే తేడా.. మిగదంతా సేమ్ టూ సేమ్ అని ఎద్దేవా చేశారు. అయితే.. కవిత వ్యవహారంపై మాత్రం కేటీఆర్ స్పందించలేదు.
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
(telugu-news | telugu breaking news)
BIG BREAKING: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తామని ప్రకటించారు. రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.
KTR Sensational Comments On Revanth Reddy
BIG BREAKING: జూన్ మాసంలో బీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ స్టార్ట్ అవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ రోజు గద్వాల నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు వస్తే గద్వాల్ లో మళ్లీ గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయ హస్తమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తరువాత 10 ఏండ్లు బలమైన పునాది వేశామన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్క బోర్ల పడ్డారన్నారు.
ఇది కూడా చదవండి: KCR Vs Kavitha: తండ్రితో తాడో పేడో.. కవిత ప్లాన్-బీ ఏంటో తెలుసా?
Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
ఎన్ని రోజులు చూడాలి ఈ కాంగ్రెస్ పార్టీ దరిద్రాన్ని అని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారు. 10 మంది సన్నాసులు పార్టీ విడిచి వెళ్లిపోయారో, వారికి కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. మనతోనే ఉండి మనకే వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తాను ఆవేశంతో చెప్పడం లేదని బాధతో చెబుతున్నానన్నారు. నాడు నీళ్లు, నిధులు నియామకాలు కోసం ఉద్యమం చేశామన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిందలు, దందాలు, చందాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. గంగుల కమలాకర్ సంచలన ప్రకటన!
రేవంత్ రెడ్డి ఒక సారి రాము.. మరోసారి రెమో..
రుణమాఫీపై అనేక సార్లు మాట మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. చారాణ కోడికి భారాణ మసాలా అన్నట్లు రుణమాఫీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుందన్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి రాము, ఇంకోసారి రెమో అవుతాడన్నారు. సినిమాలో రెమోకు జుట్టు ఉంటుంది, రేవంత్ రెడ్డికి జుట్టు ఉండదు అంతే తేడా.. మిగదంతా సేమ్ టూ సేమ్ అని ఎద్దేవా చేశారు. అయితే.. కవిత వ్యవహారంపై మాత్రం కేటీఆర్ స్పందించలేదు.
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
(telugu-news | telugu breaking news)