/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Malla-Reddy-3-jpg.webp)
Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి ఉహించని షాక్ తగిలింది. ఆయన అనుచరుడి నిర్మాణంపై హైడ్రా పంజా విసిరింది. మేడ్చల్ జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. జవహర్ నగర్ యాప్రల్లో డీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ కూల్చివేతకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 32, 14లో ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. మల్లారెడ్డి అనురుడు నర్సింహారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్గా అధికారులు గుర్తించారు. మున్సిపల్, GHMC, హైడ్రా అధికారులు దగ్గరుండి ఆ నిర్మాణాన్ని కూల్చివేయిస్తున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: ఇందిరమ్మ ఇళ్లు మూడు నమూనాల్లో.. ఇందులో మీ ఇష్టం
గతంలో మల్లారెడ్డితో పాటు...
గతంలో కూడా మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రాతో పాటు మున్సిపల్ అధికారులు కూల్చివేతలు జరిపారు. పక్కకే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డి కాలేజీలోకి రావడానికి రోడ్డు వేశారని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఆనాడు దీనిపై మల్లారెడ్డి స్పందిస్తూ.. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని.. తనకు సంబంధించిన ఆస్తులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు చేశారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిన చర్య అని వివరించారు.
ఇది కూడా చదవండి: నిఖేశ్కుమార్ ఫ్రెండ్ లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు!
కాగా గతంలో తన ఆస్తులను కాపాడుకునేందుకు మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అదే సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ను ఆయన మల్లారెడ్డి కలవడం ఈ పార్టీ మార్పు చర్చలకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు మల్లారెడ్డి అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీలోని భవనాన్ని అధికారులు కూల్చివేశారు. దుండిగల్ లో ఉన్న ఇంజరింగ్ కాలేజీలో ఉన్న ఒక కుంటాను కబ్జా చేసి ఆ భవనాన్ని నిర్మానించారని అధికారులు ఆ భవనాన్ని కూల్చి వేశారు.
ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ
ఇది కూడా చదవండి: శ్రీశైలం మల్లన్న సేవలో కొత్త జంట చైతూ-శోభిత.. ఫొటోలు వైరల్