TG: తమిళనాడు తరహాలో స్కూళ్ళల్లో బ్రేక్ ఫాస్ట్.. ప్రకటించిన తెలంగాణ సీఎం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని  రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 

New Update
cm revanth reddy

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన విద్యా పునరుజ్జీవన వేడుక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి  ఎంకే స్టాలిన్ , ఉప ముఖ్యమంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్  ఇతర మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  ఇందులో రేవంత్ రెడ్డి తమిళనాడు స్కూలు విధానానాలు, అక్కడి బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాల గురించి మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు నాయకుడు కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నామని.. విద్యా రంగంలో తమిళనాడు అత్యుత్తమ విధానాలను అవలంభించడం అభినందనీయమని రేవంత్ రెడ్డి అన్నారు. తమిళనాడు అవలంభిస్తున్న బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమం తన హృదయాన్ని తాకిందని...అందుకే వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.

తమిళనాడు విద్యావిధానం అభినందనీయం...

కామరాజ్ గారు తమిళనాడులో తీసుకొచ్చిన విద్యావిధానం దేశం అనుసరిస్తోంది. దేశంలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు.  తనను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గర్వపడుతున్నానని.. కరుణానిధి విజన్ ను... అమలు చేస్తున్న స్టాలిన్ , ఉదయనిధి లను  అభినందిస్తున్నానని సీశ్రీం రేవంత్ రెడ్డి మాట్టాడారు. విద్య రంగంపై ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు దానంగా ఇచ్చేది కాదని, నిధులు కేటాయించడం ఒక న్యాయంగా, ఒక హక్కుగా భావిస్తున్నామని చెప్పారు. దేశంలో విద్య మాత్రమే సమానత్వం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధనకు మార్గమని భావిస్తున్నఆమని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తమిళులు, తెలుగు ప్రజల మధ్య వేల సంవత్సరాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. దేశంలో 1991 సరళీకృత ఆర్థిక విధానాల తర్వాత తమిళనాడు తయారీ రంగంలో వృద్ధి సాధిస్తే, తెలంగాణ ఐటీ, ఫార్మా రంగాల్లో అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య సారూప్యత ఉందని తెలంగాణ సీఎం చెప్పుకొచ్చారు. 

తెలంగాణలో మా ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. నూతన విద్యా విధానం ద్వారా అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. స్కిల్స్ పెంపొందించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు వేర్వేరుగా నడుస్తున్న పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చి వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపిస్తున్నామని స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు