Anchor Swetcha Daughter: కన్నీళ్లు పెట్టిస్తున్న యాంకర్ స్వేచ్ఛ కూతురి మాటలు.. (వీడియో)

యాంకర్ స్వేచ్ఛ మృతిపై తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది. వాన్ని నమ్మి తన తల్లి మోసపోయిందని కన్నీరు పెట్టుకుంది. వాడు మంచివాడు కాదని తనకు అనిపించిందని.. వద్దమ్మా అని చెప్పినా అమ్మ వినలేదు అని చెప్పింది.

New Update

యాంకర్ స్వేచ్ఛ మృతి కేసు సంచలనంగా మారింది. స్వేచ్ఛ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తమ కూతురు స్వేచ్ఛది హత్య అని.. ఆమె బలవన్మరణానికి పూర్ణచందరే కారణం అంటూ- స్వేచ్ఛ తండ్రి శంకరన్న ఆరోపిస్తున్నారు. పూర్ణచందర్‌,స్వేచ్ఛ మధ్య విభేదాలు ఉన్నాయని.. పూర్ణచందర్‌కు ఇతర మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియాతో తెలిపారు. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

మరోవైపు స్వేచ్ఛ కూతురు మాట్లాడుతూ.. తన తల్లి చనిపోవడానికి పూర్ణచందరే కారణమని తెలిపింది. వాన్ని నమ్మి తన తల్లి మోసపోయిందని కన్నీరు పెట్టుకుంది. వాడు మంచివాడు కాదని తనకు అనిపించిందని.. దీంతో వద్దమ్మా అని చెప్పినా అమ్మ వినలేదు అని చెప్పింది.

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

 

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

పూర్ణచందర్ తరచూ ఇంటికి వచ్చేవాడని.. అయితే అతడిని చూసినప్పుడల్లా మంచివాడిలా అనిపించలేదని తెలిపింది. అమ్మ చనిపోయిందని అతడికి సమాచారమిచ్చినా పూర్ణచందర్ రాలేదని చెప్పింది. తరచూ తన తల్లి సమాజం పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పేదని తెలిపింది. తనను ప్రతి రోజు మంచిగా చూసుకునేదని.. తరచూ హగ్ ఇచ్చి పంపించేదని చెప్పింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు