HYD Sadar: దున్నపోతుకి 31 వేల విలువ చేసే మద్యం..అది ఎన్ని ఏండ్లతో తెలుసా?

ముషీరాబాద్‌లో సదర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి రూ. 31 వేల విలువజేసే రాయల్ సెల్యూట్ విస్కీ ఫుల్‌ బాటిల్‌ తాగించడం సంచలనంగా మారింది. ఈ విస్కీ 21 ఇయర్స్ ఓల్డ్‌దిగా చెబుతున్నారు.

New Update
A bottle of liquor worth Rs. 31,000 for a buffalo

A bottle of liquor worth Rs. 31,000 for a buffalo

HYD Sadar:  హైదరాబాద్‌లో దీపావళి సందర్బంగా యాదవులు సదర్‌ ఉత్సవాన్ని అంత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దున్నపోతులతో వారు నిర్వహించే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన తెలంగాణ యాదవులంతా కుటుంబసమేతంగా ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ, ఏపీలో కొత్త వైరస్ కలకలం.. ఒల్లంతా బొబ్బలు.. భయం భయం!

దీపావళి సందర్భంగా సదర్ పండగను నగర వ్యాప్తంగా ప్రధాన కూడల్లో  నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో యాదవులు తమ దున్నపోతులను ప్రదర్శించడం ఆనవాయితీ. అంతేకాదు.. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు చేస్తూ నృత్యాలు చేయిస్తారు. ఇది సదర్‎ వేడుకలో ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇక వారు ప్రదర్శించే దున్నపోతులు సైతం లక్షల రూపాయల ధర పలుకుతాయి. వాటిని ఏడాది కాలంగా అత్యంత నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారం అందించి పెంచుతారు.  

అందులో భాగంగానే ముషీరాబాద్‌లో ఈసారి సదర్ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకల్లో వస్తాద్ గుమాన్ కాళీ కి చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2500 కేజీల బరువు.. 7 అడుగుల వెడల్పు ఉన్న ఈ దున్నపోతును మధు యాదవ్ అనే వ్యక్తి కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన సదర్‌ ఉత్సవంలో  ఈ దున్నను ఆయన  ప్రదర్శించాడు. ఈ సందర్భంగా దున్నపోతుకు  మధుయాదవ్‌ రూ. 31 వేల విలువజేసే రాయల్ సెల్యూట్ విస్కీ ఫుల్‌ బాటిల్‌ తాగించడం సంచలనంగా మారింది. ఈ విస్కీ 21 ఇయర్స్ ఓల్డ్‌దిగా చెబుతున్నారు. కేవలం విస్కీకికే 31 వేలు ఖర్చు పెడితే దున్నపోతును మెపడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడనే చర్చ సాగుతోంది. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: పాక్ ప్రధాని దీపావళి శుభాకాంక్షలు.. ఏమని ట్వీట్ చేశాడో తెలుసా?

Advertisment
తాజా కథనాలు