/rtv/media/media_files/2025/06/16/HUoyP6cwKQcGPLvlLCRE.jpg)
Kidnapping
TG Crime: ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, మామడ మాజీ ఎంపీపీ అయిన బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కుమార్ కిడ్నాప్ కావడం కలకలం రేపింది. ఆదివారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్లో ఈ ఘటన జరిగింది. హరీశ్ కుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. ఈ కిడ్నాప్ ఘటనకు సూత్రధారిగా హరీశ్ కుమార్కు గతంలో డ్రైవర్గా పని చేసిన వ్యక్తి పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను హైదరాబాద్ నుంచి మరో ముగ్గురు వ్యక్తులను పిలిపించి, కలిసిగా ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం.
కిడ్నాపర్లను తప్పించుకుని క్షేమంగా..
కిడ్నాప్ చేసిన అనంతరం నిందితులు హరీశ్ కుమార్ను బెదిరించి రూ.3 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో హరీశ్ తన సన్నిహితులకు ఫోన్ చేసి తక్షణం కొంత డబ్బు పంపాలని కోరినట్లు తెలుస్తోంది. కారు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిన సమయంలో ఆలోచనాచాతుర్యంతో హరీశ్ కిడ్నాపర్లను తప్పించుకుని తప్పించుకున్నారు. అనంతరం నేరుగా తూప్రాన్ పోలీస్స్టేషన్కు చేరుకుని తనతో జరిగినదీ వివరంగా పోలీసులకు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని హరీశ్ తన మిత్రులకు ఫోన్ చేసి తెలిపారు.
ఇది కూడా చదవండి: చెరకు రసంలో నల్ల ఉప్పు కలిపి తాగితే ప్రయోజనాలు తెలుసా..?
ఈ ఘటనతో నిర్మల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిపై ఇలా కిడ్నాప్కు తెగబడటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని మామడ ఎస్సై అశోక్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. హరీశ్ కుమార్ సమయస్పూర్తితో ప్రాణాపాయం నుంచి బయటపడటంతో విషయం తప్పిన పెను ప్రమాదంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి
( ts-crime | ts-crime-news | Latest News | telugu-news | crime)