TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సుల్లో పదిశాతం రాయితీ

విజయవాడ..హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది.

New Update
TGRTC FREE BUS

TGRTC FREE BUS

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి సూపర్ న్యూస్ అందించింది. అది కూడా హైదరాబాద్, విజయవాడ మధ్య ట్రావెల్ చేసేవారికి. ఈ మార్గంలో తిరిగే బస్సుల టికెట్ల రేట్ల మీద రాయితీలను ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీలోని లహరి నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించింది. దాంతో పాటూ రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్టు చెప్పింది. హైదరాబాద్, విజయవాడల మధ్య ప్రయాణించేవారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పింది.  ఎవరైనా ముందే టికెట్లను రిజర్వ్ చేసుకోవాలనుకుంటే  https://www.tgsrtcbus.in వెబ్ సైట్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. 

హైదరాబాద్-బెంగళూరుకు కూడా..

రెండు రోజుల క్రితం  బెంగళూరు- హైదరాబాద్ మార్గంలో ప్రయాణించేవారికి కూడా ఇలాగే రాయితీలను ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ.  బెంగళూరు మార్గంలో నడిచే అన్ని సర్వీసుల్లోనూ ఈ రాయితీని అమలు చేస్తు్న్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్క టికెట్‌పై ప్రయాణీకుడు రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలుపుతున్నారు. ఈ రూట్లలో బస్సు సర్వీసులను పెంచడంలో భాగంగానే ఈ రాయితీని తీసకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రూట్‌లో ప్రైవేటు ట్రావెల్‌ బస్సులు అధికంగా ప్రయాణిస్తుంటారు. వాటినుంచి ప్రయాణీకులను ఆర్టీసీకి మళ్లించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్లు ముందస్తు రిజర్వేషన్ కోసం https: //tgsrtcbus.in వెబ్ సైట్‌ని లాగిన్‌ అవ్వాలని కోరారు.  

Also Read: BIG BREAKING: జగన్, కొడాలి నానితో పాటూ..8 మంది వైసీపీ నేతలపై కేసు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు