Mahabubnagar MLC Election : బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) కండువాలతో గోవా నిండిపోయింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల(Telangana Lok Sabha Elections) కు ముందు జరుగుతున్న మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు యుద్ధానికి రెడీ అవుతున్నారు. రెండు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం దక్కించుకుని వచ్చే పార్లమెంటు ఎన్నికల(Parliament Elections) కు విజయంతో వెళ్ళాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలా అయినా గెలవాలని తాపత్రయ పడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana : గోవాలో తెలంగాణ రాజకీయం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక గోవాకు చేరుకున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల క్యాంపులతో గోవా నిండిపోయింది. ఓటర్లుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడంతో వారిని కాపాడుకునేందుకు ఇరు పార్టీల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Translate this News: