CEO Vikas Raj: రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్ రాజ్‌..

తెలంగాణ ఎన్నికల అధికారి సీఈవో వికాస్ రాజ్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.

New Update
CEO Vikas Raj: రాజ్‌భవన్‌కు సీఈవో వికాస్ రాజ్‌..

CEO Vikas Raj to Meet Governor: తెలంగాణ ఎన్నికల అధికారి సీఈవో వికాస్ రాజ్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇక సీఈవో నివేదిక అందిన వెంటనే కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నివేదికలో మొత్తం గెలుపొందిన అభ్యర్థులు, పోలైన ఓట్లు, ఎంత మెజారిటీతో, ఎవ‌రెవ‌రు గెలిచారనే దానిపై పూర్తి వివ‌రాల‌ను వెల్లడించనున్నారు. ఇదిలావుంటే.. సాయంత్రం త‌ర్వాత పొలిటిక‌ల్ అపాయింట్మెంట్స్ ఇస్తామ‌ని రాజ్ భ‌వ‌న్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also read :Revanth Reddy: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!

Advertisment
తాజా కథనాలు