టీడీపీ శాసనసభా పక్షం ఈరోజు సమావేశం అయింది. ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. దీనిలో టీడీఎల్పీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రేపటి నుంచి మొదలయ్యే ఏపీ శాశససభా సమావేశాలకు తమ పార్టీ హాజరు కావాలని టీడీపీ నిర్ణయించుకుంది. గురువారం నుంచి ఈ నెల 27 వరకు జరగనున్న సమావేశాలలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని తెలిపింది. దీంతో పాటు చంద్రబాబు అరెస్ట్, తరువాత రాష్ట్రంలో పరిణామాల మీద నేతలు చర్చించారు. ఈ సమావేశంలో లోకేశ్ తో పాటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా అవమానించినా ప్రజల కోసం భరిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు.
పూర్తిగా చదవండి..పోరాడదామని డిసైడ్ అయ్యాక ఎన్ని అవమానాలనైనా భరిద్దాం- నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం తీసుకుంది. ఈరోజు మీట్ అయిన టీడీఎల్పీ చంద్రబాబు అరెస్ట్, తరువాత పరిణామాల మీద చర్చించింది. చంద్రబాబు అరెస్ట్ మీద సభలో పోరాడాలని నిర్ణయం తీసుకుంది.
Translate this News: