Andhra Pradesh: అంతవరకు తెచ్చుకోకండి.. వైసీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్..

వైసీపీ నాయకులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్‌లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ధర్మవరాన్ని ఇలా తయారు చేయడమే నా బాధ్యత: పరిటాల శ్రీరామ్
New Update

Paritala Sri Ram: వైసీపీ నాయకులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ(TDP) నేత పరిటాల శ్రీరామ్(Paritala Sriram). ధర్మవరం నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అదే విధంగా దాడులు చేయడం, చెట్లు నరకడం, బోర్లు పూడ్చడం వంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిటాల శ్రీరామ్. 'మీ స్కూల్లో మీకు ఇలాంటి పాఠాలే చెప్పి ఉంటారు.. కానీ మా స్కూల్లో వేరే పాఠాలు చెప్పారు.. వాటిని బయటకు తీసేంత వరకు తెచ్చుకోవద్దు' అని శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.

శనివారం నాడు ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయంలో నాయకులకు, క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఆశగా ఎదురు చూడటంతో పాటు.. ఆయనకు ఇలా జరిగిందనే ఆవేదనతో ఉన్నానని చెప్పారు. కానీ ఇక నుంచి అలాంటి ఆందోళన, బాధ నుంచి బయటకు రావాలని.. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు.

అయితే, అప్పటి వరకు గ్రామ స్థాయి నుంచే పార్టీ కార్యక్రమాలను బలంగా చేపట్టి.. చంద్రబాబులో మరింత ఉత్సాహం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పరిటాల శ్రీరామ్. చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తరువాత నేరుగా ముఖ్యమంత్రి అయ్యే విధంగా మార్గం సుగమం చేద్దామని పార్టీ నేతలకు చెప్పారు. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఏ కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందన్నది లెక్కలతో సహా వివరించాలన్నారు.

Also Read: కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..

'మీపై ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పజెబుతున్నాను.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దు.. ప్రతి ఒక్కరూ ప్రతి రోజు 10 ఇళ్ల వద్దకు వెళ్లాలి. ఇలా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15వరకు కార్యక్రమాలు చేపట్టాలి. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం వస్తే జరిగే మంచి గురించి వివరిస్తూ.. చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు మరింత వివరంగా చెప్పాలి. ఎన్నికలకు ఇక నాలుగు నెలలే సమయం ఉంది. ప్రతి కార్యకర్త దీనిని గుర్తించి.. పార్టీ కోసం పని చేయాలి.' అని పార్టీ శ్రేణులకు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొందరు నాయకులు ప్రాణాలకు తెగించి నిలబడ్డారని.. అలాంటి వ్యక్తుల లీస్ట్ తాను రాసి పెట్టుకున్నానని చెప్పారు శ్రీరామ్. అలాంటి వారికి న్యాయం చేసిన తరువాతనే మిగిలిన వాటి గురించి ఆలోచిస్తానన్నారు. వైసీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని.. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులను జైలుకు పంపించినప్పుడు భవిష్యత్‌లో వారి పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలన్నారు. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలని వార్నింగ్ ఇచ్చారు పరిటాల శ్రీరామ్.

Also Read: Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు డీకే శివకుమార్ షాక్.. ఆ ఒక్క ప్రకటనతో..

#andhra-pradesh-news #paritala-sri-ram #tdp #andhra-pradesh #ysrcp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe