Andhra Pradesh : వైసీపీలోకి కీలక నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు

టీడీపీ, జనసేన కూటమి నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. ఇందులో పోతిన రమేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్‌ కుమార్‌ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవిలు ఉన్నారు.

Andhra Pradesh : వైసీపీలోకి కీలక నేతలు.. జగన్ సమక్షంలో చేరికలు
New Update

TDP - Janasena Leaders Joined In YCP : ఆంధ్రాలో ఎన్నికల(AP Elections) ముందు వైసీపీ(YCP) లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పల్నాడు మేమంతా సిద్ధం సభలో జగన్(CM Jagan) సమక్షంలో పలువురు టీడీపీ, జనసేన కీలక నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు R.రమేష్‌ కుమార్‌ రెడ్డి, పాముల రాజేశ్వరీదేవికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైసీపీ అధినేత జగన్. జనసేన నుంచి విజయవాడ వెస్ట్‌ టికెట్ ఆశించిన పోతిన మహేష్ భంగపడ్డారు. అక్కడి టికెట్ పొత్తుల్లో భాగంగా బీజేపీ లీడర్ సుజనా చౌదరికి ఇచ్చారు.

పొత్తులు ముంచిన సీట్లు..

ఇక రాయచోటి టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే R.రమేష్‌ కుమార్‌ రెడ్డి(R Ramesh Kumar Reddy) కూడా ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు.

ఈయనతో పాటూ పి.గన్నవరం జనసేనలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి కూడా ఉన్నారు. పొత్తుల నెపంతో తమకు పార్టీలు తీరని అన్యాయం చేశాయని నేతలు అంటున్నారు. అ తీవ్ర అసంతృప్తితోనే వైసీపీలో జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారు. జగన్ సమక్షంలో వైసీపీలో నేతలు వారితో పాటూ కార్యకర్తలు కూడా భారీగా ఇవాళ వైసీపీలో చేరారు.

Also Read : Africa : ఆఫ్రికాలో ఎమెర్జెన్సీ..కుష్‌తో ఊగిపోతున్న జనం

#tdp #ap-cm-jagan #andhra-pradesh #janasena #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe