Sharmila : ఇక కాస్కోండి తమ్ముళ్లు... షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..!
ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ యాత్రకు సిద్ధమయ్యారు. 2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు సిద్ధమైంది.