Tirupathi: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
వైసీపీనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. బెంగుళూరులో మోహిత్ ను అరెస్ట్ చేశారు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 37వ నిందితుడుగా మోహిత్ పేరు ఉంది.
AP: జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీరు చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ కు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. పార్టీతో పాటు గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగన్ కు ఆయన లేఖ రాశారు. దీంతో రోశయ్య ఏ పార్టీలో చేరుతారనే అంశంపై చర్చ సాగుతోంది.
తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ఈ విషయాన్నిట్విటర్ ఖాతా ద్వారా ఎంపీ విజయ సాయి రెడ్డి వెల్లడించారు. గవర్నెన్స్, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన పలు విషయాలపై అమిత్ షాతో చర్చించినట్లు విజయసాయిరెడ్డి వివరించారు.
గుంటూరులో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
AP: పుంగనూరులో నిన్న జరిగిన టీడీపీ, వైసీపీ పరస్పర దాడుల్లో కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ నాయకుడు సుహేల్ భాష ఫిర్యాదు మేరకు హత్యయత్నంతో సహా పలు సెక్షన్ల కింద A1గా ఎంపీ మిథున్ రెడ్డి, A2గా మాజీ ఎంపీ రెడ్డప్పతో సహా 34 మంది పై కేసు నమోదు చేశారు.