Weather Alert : భారీ వర్షాలు.. 11 మంది మృతి
కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
కేరళలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ప్రభావానికి రాష్ట్రంలో 11 మంది మృతి చెందారు.
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉంది. దీన్ని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది.
తమిళనాడు రాష్ట్రాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. అలాగే భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాలు రద్దు అయ్యాయి.
ఏపీకి మరోసారి భారీ వర్షసూచన జారీ అయ్యింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు రానున్నాయి. రానున్న ఐదారు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో రెండు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ దిశల నుంచి బంగాళఖాతం మీదుగా రాష్ట్ర వైపు గాలుల వీస్తుండమే ఈ వర్షాలకు కారణమని పేర్కొంది.
తెలుగురాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు మూడు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక, యూపీ, రాజస్తాన్, కేరళ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దేశరాజధానిలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయినప్పటికీ..రానున్న 24గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో ఏపీలో వచ్చే మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గత రాత్రి నుంచి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగుతోంది. సోలన్లోని జాడోన్ గ్రామంలో క్లౌడ్ బస్ట్ తో ఐదుగురు మరణించారు. ముగ్గురు అదృశ్యమయ్యారు. వరద కారణంగా జిల్లాలో గోశాల, రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ధరంపూర్లోని తాన్యాహాద్ పంచాయతీలోని నల్యానాలో మురుగునీరు ఇంట్లోకి చేరడంతో ముగ్గురు జలసమాధి అయినట్లు సమాచారం.