Hyderabad Tragedy: హైదరాబాద్లో విషాదం.. ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన పిల్లర్ గుంత!
హైదరాబాద్లోని ఉప్పల్ భాగాయత్ దగ్గర నిర్మాణం పిల్లర్ కోసం తవ్విన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన బాలురు జోగులాంబ గద్వాల జిల్లాకి చెందిన అర్జున్, మణికంఠగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.