BIG BREAKING: వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ టీవీ యాక్టర్ అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శుక్రవారం ముంబైలోని జోగేశ్వరి రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. జైస్వాల్ వెళ్తున్న మోటార్బైక్ను ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి నలుగు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగవైభవంగా చేశారు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే.
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంపై మరో కొత్త కోణం బయటపడింది. బెట్టింగ్ నేపథ్యంలో ఘర్షణ జరిగిందనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు బెట్టింగ్కు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ నాని పాత్రకూడా ఉందని అధికారులు భావిస్తున్నారు.
వియాత్నంలో విషాదం నెలకొంది. హనోయి అగ్నిప్రమాదం వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 50కి పైగా మరణించారు, పలువురు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారంగా ఇంకా వెల్లడించలేదు. అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) 150 మంది నివాసితులు ఉన్న భవనంలో అర్ధరాత్రి మంటలు చెలరేగినట్లు పేర్కొంది.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండలో మహిళా దారుణ హత్య జరిగింది. ఆటో కొనుగోలు లెక్కలలో తేడా వచ్చిందని అక్కను చంప్పాడు ఓ తమ్ముడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కోపంతో అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.
విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్లో మాదిరిగా ఫీట్స్ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు.