Tirupati Temple Land Clashes | తిరుపతిలో భూకబ్జాదారులు? | Tense Situation at Tirupati Daminedu | RTV
పలమనేరులోని టీటీడీ గోశాలను చైర్మన్ బీఆర్ నాయుడు ఈ రోజు ఆకస్మికంగా పరిశీలించారు. అపరిశుభ్రత, నిర్వహణ లోపాలు ఉన్నట్లు గుర్తించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గోశాల నిర్వహణపై వారంలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఈ రోజు ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఆలయంపై విమానాలు తిరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో మరోసారి వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తిరుమలకు సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు టీటీడీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్రోల్మెంట్ స్లిప్ తెచ్చుకుంటే క్యూ లైన్లో నిల్చునే బాధ లేకుండా సిబ్బంది నేరుగా గదులను కేటాయించనున్నట్లు తెలిపింది.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.
తిరుపతి జిల్లాలో 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత డెత్ మిస్టరీపై ఆమెను ప్రేమించిన అజయ్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. నిఖితను ఆమె తల్లిదండ్రులు వేధింపులకు గురిచేశారని, పరువు కోసం వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని సంచలన ఆరోపణలు చేశాడు.