లడ్డులో కల్తీ నెయ్యి ఎక్కడిది ? | Tirumala Laddu Issue | SIT Enquiry | Tirumala | RTV
తిరుపతి లడ్డూ వివాదం వేళ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ ఫామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్యమతస్థుడైన షారుఖ్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, క్రైస్తవుడైన జగన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు రావాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం ఎఫెక్ట్ యూపీలోని పలు ఆలయాలకు తాకింది. పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు చేయాలని మధురలోని ధర్మ రక్షా సంఘం నిర్ణయం తీసుకుంది. పండ్లు తదితర సహజసిద్ధమైన పదార్థాలతో ప్రసాదం తయారు చేయాలని పలు ఆలయాల నిర్వాహకులు నిర్ణయించారు.
మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
AP: మాజీ సీఎం జగన్ రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. రేపు శ్రీవారిని కాలినడకన దర్శించుకోనున్నారు. జగన్ రాకతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
AP : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డూ వివాదంలో పవన్పై పేర్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు నాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
AP: జగన్ తిరుమల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని పురందేశ్వరి అన్నారు. కాగా ఎల్లుండి తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు.
శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడుతున్నారనే వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా దీనిపై నటి ప్రణీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి విషయంలో ఇలా జరగడం ఎంతో దారుణం. ఈ పని చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని xలో పోస్ట్ పెట్టారు.