AP: దొంగల బీభత్సం.. సర్పంచ్ చెవి కోసి ఏం చేశారంటే..?
నంద్యాలలోని రాయమాల్పురం గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న సర్పంచ్ పార్వతమ్మపై దాడి చేసి.. ఆమె చెవి కోసి బంగారు కమ్మలు, గొలుసు అపహరించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.