రాష్ట్ర బడ్జెట్ లో ఉండబోయే అంశాలు ఇవే.! | Telangana Budget 2025-26 | Bhatti Vikramarka | RTV
తెలంగాణ అసెంబ్లీలో నేడు రేవంత్సర్కార్ 2025-26 ఆర్థికసంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉదయం 11.44లకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ జీరో అవర్లో అధికారుల తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన అప్లయ్.. అప్లయ్ నో రిప్లయ్ అన్నట్లుగా ఇక్కడ నడుస్తోందని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్, BRS, MJP, MIM, CPI నాయకులతో మోదీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లు 42శాతానికి పెంచే బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది.
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్వీ కార్యకర్తలు ధర్నాకు దిగారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమం జరగనుంది. ఈ నెల 19న బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ కొనసాగనుంది.
గతంలో కేసీఆర్ గారితో పాటు తమ కుటుంబంలోని చంటి పిల్లలను కూడా వదిలిపెట్టకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు అవి తిరిగి ముఖ్యమంత్రికే వస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలంటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ను కోరారు. స్పీకర్ పట్ల జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్ గురించి పునర్పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.