Kalvakuntla Kavitha : అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు...అనుముల ఇంటెలిజెన్స్ అని, అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదమని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటును కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద ధర్నానిర్వహించారు.

New Update
Kavitha Kalvakuntla

Kavitha Kalvakuntla

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్...అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదముందని.ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జ్యోతిభాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ జాగృతి, యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌ (యూపీఎఫ్‌) ఆధ్వర్యంలో ఈ రోజు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ అనుమల ఇంటెలిజెన్స్‌తో ప్రమాదముందని ఎద్దేవా చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్‌ అని కవిత అన్నారు.

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని కవిత ఆరోపించారు. బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంటా అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టామని, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు ?అని కవిత ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదన్నారు. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదన్నారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తామని కవిత స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమని,అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలో కూర్చుందామంటూ పిలుపునిచ్చారు.

 Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!


చట్టసభలో బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైంది. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా... లేదా రాష్ట్రపతికి పంపించారా ? తెలపాలన్నారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారు.కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లలేదన్నారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేదని కవిత అన్నారు. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదు.దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని ఎగతాళి చేశారు. ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాటల్లో మాట్లాడాలి అని గుర్తుచేశారు.

 Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!


కులగణన అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన సంస్థ హెచ్చరిక చెబుతోంది. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి, చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టండిఅని నిలదీశారు. ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలి. దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే. పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారు. మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలే. కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ధైర్యంగా ముందుకే వెళ్తాము తప్పా... వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించాం. ఇది తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీఆర్ఎస్ పార్టీ విజయమని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు