Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు. తనది అలాంటి స్వభావమే అయితే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. గతంలో తనను ఎంతో ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. పార్లమెంట్ సభ్యుడిగా నన్ను జైళ్లో వేస్తే 16 రోజులు నిద్రపోలేదు. చెట్టుకింద నిద్రపోయా. అయినా నేను కోపం ప్రదర్శించలేదు.16 రోజుల పాటు జైలులో పెట్టారు. బల్లులు తిరిగే బాత్రూంలో బంధించారు. కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చారని ఎమోషనల్ అయ్యారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్
సొంత పార్టీ ఆఫీస్లో, సొంత పార్టీ నేతలతోనూ తనను తిట్టించారని అన్నారు. రివేంజ్ తీసుకోవాలనుకుంటే ఎంతో సమయం పట్టదని.. వాటి మీద నేను దృష్టి పెట్టుంటే ఇవాళ వాళ్లంతా జైలులో ఉండేవారని అన్నారు. నన్ను వేధించిన వారిని ఆ దేవుడే ఆస్పత్రి పాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తాము అలా చేయడం లేదు.. అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. నేను కక్షసాధింపుకు పాల్పడితే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు.ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తా అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చా. అది కూడా నేను అమలు చేయలేదు అన్నారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు అంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతుభరోసా ఇచ్చాం, రుణమాఫీ చేశాం, 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, మహిళలకు ఆర్టీసీ ల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం.. ఇలా చెప్పుకుంటే పోతే ఏడాదిన్నలోనే అనేక పనులు చేశామని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరి దోచుకో.. దాచుకో అనేది తమ సిద్ధాంతం కాదని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని రైతులను కేసీఆర్ అనేక రకాలుగా వేధించారు.. ఆయన ఫామ్హౌజ్లో మాత్రం వరి పండించారని అన్నారు.
Also read: OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!
Telangana Assembly : జైళ్లో నిద్రపట్టలే...ఆ హామీని నెరవేర్చలేకపోయా....అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కక్షసాధింపుకు పాల్పడితే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తా అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చా. అది కూడా నేను అమలు చేయలేదు అన్నారు.
KTR vs Revanth Reddy
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తాను కక్షసాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తిని కాదని అన్నారు. తనది అలాంటి స్వభావమే అయితే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేదని చెప్పారు. గతంలో తనను ఎంతో ఇబ్బందులకు గురిచేశారని గుర్తుచేశారు. పార్లమెంట్ సభ్యుడిగా నన్ను జైళ్లో వేస్తే 16 రోజులు నిద్రపోలేదు. చెట్టుకింద నిద్రపోయా. అయినా నేను కోపం ప్రదర్శించలేదు.16 రోజుల పాటు జైలులో పెట్టారు. బల్లులు తిరిగే బాత్రూంలో బంధించారు. కూతురి పెళ్లికి కూడా రానీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చారని ఎమోషనల్ అయ్యారు.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్డేట్
సొంత పార్టీ ఆఫీస్లో, సొంత పార్టీ నేతలతోనూ తనను తిట్టించారని అన్నారు. రివేంజ్ తీసుకోవాలనుకుంటే ఎంతో సమయం పట్టదని.. వాటి మీద నేను దృష్టి పెట్టుంటే ఇవాళ వాళ్లంతా జైలులో ఉండేవారని అన్నారు. నన్ను వేధించిన వారిని ఆ దేవుడే ఆస్పత్రి పాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ తాము అలా చేయడం లేదు.. అభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు. నేను కక్షసాధింపుకు పాల్పడితే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు.ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం కట్టిస్తా అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చా. అది కూడా నేను అమలు చేయలేదు అన్నారు.
Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు అంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతుభరోసా ఇచ్చాం, రుణమాఫీ చేశాం, 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం, మహిళలకు ఆర్టీసీ ల్లో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం.. ఇలా చెప్పుకుంటే పోతే ఏడాదిన్నలోనే అనేక పనులు చేశామని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాదిరి దోచుకో.. దాచుకో అనేది తమ సిద్ధాంతం కాదని తెలిపారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని రైతులను కేసీఆర్ అనేక రకాలుగా వేధించారు.. ఆయన ఫామ్హౌజ్లో మాత్రం వరి పండించారని అన్నారు.
Also read: OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!