సభ నీ జాగీరు కాదు.. | BRS MLA Jagadeesh Reddy Fires On Speaker | Telangana Assembly | RTV
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశంలో ఉబయ సభలను ఉద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు..అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవుతుందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాజీ మంత్రి మాట్లాడుతూ..కనీసం 20 రోజులు అసెంబ్లీ నడపాలని బీఏసీలో డిమాండ్ చేశామని తెలిపారు.
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్లిన గూడెం .. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని స్వయంగా అహ్వానించారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 19న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ కేసీఆర్ సభకు హాజరుకానున్నారు.
లంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. రేపు ఉ. 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని, ఆయనకు చెల్లించే వేతనం నిలిపివేయాలంటూ వారు ఫిర్యాదు చేశారు.కేసీఆర్కు ఇచ్చిన జీతాన్ని కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేది ఖరారైంది. మార్చి 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఈ రోజు సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.