AP : ఏపీలో 47. 7 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు.. నేడు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు!
ఏపీలో సూర్యుడు రోజురోజుకు మండుతున్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. నేడు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.