బ్యాగ్లో రూ.22 లక్షలు.. అలా ఎలా దొరికిపోయారు బ్రో!
హైదరాబాద్లోని కోఠి గుజరాత్ గల్లీలో భారీగా హవాలా డబ్బు పట్టుపడింది. మహ్మద్ అబ్దుల్, ఉత్తమ్ కుమార్, లలిత్ సింగ్ అనే వ్యాపారులు అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ను తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగ్ లోని రూ.22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు.