సజ్జల రామ కృష్ణకు బిగ్షాక్.! | BIG Shock To Sajjala Rama Krishna | CM Chandrababu | YS Jagan | RTV
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు కాస్త ఊరట లభించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి మరోసారి పొడిగించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కు వాయిదా వేసింది.
AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ నేతలే టార్గెట్గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
గత ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల విచారణకు సహకరించలేదని, ఏం అడిగిన తెలీదని, గుర్తులేదని సమాధానాలు ఎక్కువగా ఇచ్చారని పోలీసులు తెలిపారు.
సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాల్లో ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలను మళ్లీ అప్పగించారు. దీంతో సజ్జలను పక్కకు పెట్టి.. సాయిరెడ్డికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.