Weather Update: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి నలుగురు స్పాట్ డెడ్
సిక్కింలో విషాదం చోటుచేసుకుంది. రాంబీలో కొండచరియలు విరిగిపడటంతో 4గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.