Kerala Rains | మునిగిన కేరళ.. | Wayanad Floods | Tamilnadu Rains | Southwest Monsoon | Weather | RTV
బెంగళూరు నగరంలో ఆదివారం భారీ వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దాదాపు 40 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, వంటి ప్రాంతాలు నీట మునిగాయి.
తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఉత్తరాంధ్రలో శని, ఆదివారాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అయితే, శ్రీకాకుళం, విజయనగరంలో వడగాలులు తీవ్రంగా ఉంటాయి. ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపారు.
తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
రాష్ట్రంలో వైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలు పెరుగుతుండడంతో జనం వేడికి అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ని అందించింది. తెలంగాణలో రానున్న మూడురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.