Rahul Gandhi : నీట్పై లోక్ సభ చర్చ జరగాలి.. రాహుల్ గాంధీ డిమాండ్
లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఇది లక్షల మంది యువత భవిష్యత్పై ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని మోదీ కూడా చర్చలో పాల్గొనాలని కోరారు. కాగా పేపర్ లీక్పై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.