Puri Rath Yatra: పూరీ జగన్నాథ్ రథయాత్రలో 500 మంది భక్తులకు గాయాలు
ఒడిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో అపశృతి చేసుకుంది. దాదాపు 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మూడు రథాలను లాగడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పూరీలో రథాలను లాగుతున్న సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.