Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరద హెచ్చరికలు!
పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్ వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరదల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత్ వైపు నుంచి నీటి ప్రవాహం పెరిగిపోయిందని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని కోరారు. టెర్రర్ అటాక్కు వ్యతిరేకంగా కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొని.. పాక్ని 2 ముక్కలు చేసి POKని ఇండియాలో కలపాలని ప్రధానికి ఆయన సూచించారు.
శ్రీనగర్లోకి కొందరు విదేశీయులు ఆయుధాలతో ప్రవేశించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తులను శ్రీనగర్లో దాచినట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఇండియాలో విలీనం చేయడమే పాకిస్తాన్లో ఉన్న సమస్యకు పూర్తి పరిష్కారమని ప్రముఖలు అంటున్నారు. ఇదే మాట మంత్రులు జై శంకర్, రాజ్ నాథ్ సింగ్ లు కూడా మీడియాతో చెప్పారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు రెచ్చిపోయి పహల్గామ్ అటాక్కు పాల్పడ్డారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనల మధ్య భారత్ అనుకూల నినాదాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భారత జెండాను తొలిసారిగా నిరసనకారులు ప్రదర్శించడం పాక్ ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేసింది.
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే POKను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు అమిత్ షా. రేవంత్ రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి SC, ST, OBCలకు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆక్రమిత కాశ్మీర్లో బ్రిటీష్ రాయబారి పర్యటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిటీష్ హైకమీషనర్ జానె మారియట్ జనవరి 10న పీవోకేలో పర్యటించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
కశ్మీరీ పండిట్లు అత్యంత పవిత్రంగా భావించే శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్ సైన్యం భావిస్తోంది. ఈ పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది.