India: యుద్ధ వాతావరణంలో నష్టపోయిన పాలస్తీనియన్లు.. భారత్ మానవతా సాయం..
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ దేశ ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. విపత్తు సహాయ సామాగ్రిని అలాగే ఔషధలాను ఆదివారం గాజాకు తరలించింది. ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటుగా ఇతర వస్తువులను మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ 'ఎక్స్' లో వెల్లడించారు.