ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..కానిస్టేబుల్ మృతి.. అసలు ఏం జరిగిందంటే..?
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వ లాంఛనాలతో గంధం నరేంద్ర భౌతిక కాయానికి పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.