ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్

ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ వాసులు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో తల్లి, కొడుకు స్పాట్‌లోనే మృతి చెందారు.

New Update
NTR

ఎన్టీఆర్ జిల్లా గరికపాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో తల్లి, కొడుకు అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కి చెందిన వారు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్ చోటుచేసుకుంది. నిన్న విజయవాడ వెళ్లి ఈ రోజు ఉదయం హైదరాబాద్‌కి తిరిగి వస్తుండగా.. రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో తల్లి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. 

ఇది కూడా చూడండి:  టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

రాజస్థాన్‌లో మరో ఘటన..

ఇదిలా ఉండగా.. రాజస్థాన్​లోని ధోల్​పుర్​ జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నహ్నూ, జహీర్​ కుటుంబసభ్యులతో కలిసి బరౌలీ గ్రామంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్లాడు.

ఇది కూడా చూడండి: 12 ఏళ్లుగా కడుపులో కత్తెర.. తర్వాత ఏమైందంటే?

కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న టెంపోని స్పీడ్‌తో వస్తున్న స్లీపర్ బస్సు ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 8 మంది చిన్నారులతో సహా 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు.  విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు

ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి ఈ ఘటన జరగడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో వారికి చికిత్సను అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ప్రజలను వణికిస్తున్న విచిత్రమైన జ్వరం.. ఆసుపత్రికి క్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు